Monday, May 20, 2024
Monday, May 20, 2024

వైసీపీ పాలన అవినీతిమయం

విశాలాంధ్ర`పెద్దకడబూరు : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అవినీతి పాలన కొనసాగుతోందని టిడిపి మండల కన్వీనర్‌ బసలదొడ్డి ఈరన్న, నాయకులు దశరథరాముడు, నరసన్న, వెంకటరామిరెడ్డి, పెద్దయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టిడిపి నేతలు ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని జగన్‌ ప్రభుత్వం మోపిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధప్ప,నర్సింహులు, సత్యగౌడ్‌,ముక్కన్న, మునిస్వామి, కంబగిరి, రంగన్న, ఈరన్న, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img