Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

విశాలాంధ్ర`వత్సవాయి : మండల కేంద్రమైన వత్సవాయి లోని స్థానిక భవిత సెంటర్‌ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు.ఎంపిపియస్‌ మెయిన్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ఎన్‌ పుల్లయ్య మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు సాధారణ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని, వారికి సరైన ప్రోత్సాహం ఇచ్చినచో గొప్ప గొప్ప విజయాలను సాధించగలరని అన్నారు. వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటాయి కనుక వాటిని సద్వినియోగం చేసుకున్నచో గొప్ప పదవులు సాధించవచ్చునని అన్నారు..సిఆర్పీ రవిబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇలాంటి బిడ్డ తమకు జన్మించినందుకు దిగులు పడకుండా బిడ్డలో ఆత్మస్థైర్యాన్ని నింపి గొప్ప విజయాలు సాధించే దిశగా కృషి సల్పాలని పెంపోందించాలన్నారు.అనంతరం గత మూడు రోజులుగా నిర్వహించిన డాన్స్‌, డ్రాయింగ్‌, ఆటపాటల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఈఆర్పి డి. ఉదయలక్ష్మి, ఎస్‌. శ్రీ విష్ణు దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,సిజివి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img