హైదరాబాద్ : దేశంలోని నంబర్వన్ స్మార్ట్ఫోన్, టీవీ బ్రాండ్ ఎంఐ ఇండియా సబ్ బ్రాండ్ రెడ్మి తాజాగా తమ రెడ్మి బుక్ సిరీస్తో ల్యాప్టాప్ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. లేటెస్ట్ 11వ తరం ఇంటెల్ౖ కోర్ప్రాసెసర్ల శక్తితో పనిచేసే, ఈ ఉత్పత్తుల్లో రెండు సిరీస్ల సన్నని, తేలికపాటి ల్యాప్టాప్లు- రెడ్మి బుక్ ప్రో, రెడ్మి బుక్ ఇ-లెర్నింగ్ ఎడిషన్ ఉన్నాయి. ‘‘ఎక్కడి నుంచైనా పని చేయడం’, ‘‘ఇంటి నుంచి నేర్చుకోవడం’’ కోసం తయారు చేసిన వీటిలోని ప్రత్యేకతలు, రెడ్మి బుక్ మొత్తం అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా ఒక వ్యక్తి ప్రొడక్టివిటీని అన్లాక్ చేసేందుకు సహాయపడుతుంది.