Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

17న జరిగే విశ్రాంతి ఉద్యోగుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి

సంఘం అధ్యక్షులు కె. క్రిష్టప్ప
విశాలాంధ్ర` ఉరవకొండ :
ఈనెల 17వ తేదీన ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల జాతీయ దినోత్సవాన్ని ఉరవకొండ పట్టణంలోనే విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల తాలూకా అధ్యక్షులు కే.కృష్ణప్ప తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు విశ్రాంతి ఉద్యోగుల పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని అనంతరం 70 సంవత్సరాలు వయస్సు కలిగిన విశ్రాంతి ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉరవకొండ సబ్‌ ట్రెజరీ అధికారి నాగేంద్రబాబు, ఎస్బిఐ బ్రాంచ్‌ మేనేజర్‌ రాజేష్‌ పాల్గొంటున్నారని పెద్ద సంఖ్యలో విశ్రాంతి ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img