Friday, April 26, 2024
Friday, April 26, 2024

19న జరిగే ధర్నాను జయప్రదం చేయండి – సిపిఐ

విశాలాంధ్ర`ఉరవకొండ : అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 19 వ తేదీన సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలి రావాలని ఉరవకొండ నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి జే మల్లికార్జున, సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ వరుసగా సంభవిస్తున్న భారీ వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలను తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయం ముందు జరిగే ఆందోళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు రైతు కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు చెన్నారాయుడు, ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున, వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img