విశాలాంధ్ర-రాప్తాడు..ఉపాధ్యాయులకు నెలకొన్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కృషి అభినందనీయమని ఎంఈఓ మల్లికార్జున అన్నారు. రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ లో మంగళవారం ఏపీటీఎఫ్ 2023 డైరీ, క్యాలెండరును ఆవిష్కరించారు. ఎంఈఓ మాట్లాడుతూ 75 సంవత్సరాల ఉపాధ్యాయ ఉద్యమ చరిత్ర, విద్యారంగ అభివృద్ధికి, విద్యారంగ పరిరక్షణకు ఏపీటీఎఫ్ కృషి చేయడంపై డైరీ లో పొందుపరచడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సిరాజుద్దీన్, మండల అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బాలకదిరప్ప, నాయకులు వెంకటరాముడు, ఆదినారాయణ రెడ్డి, గోపీనాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు