విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని జోగోని గుంటలో నివసిస్తున్న బెస్త రాజమ్మ ఇటీవల క్యాన్సర్ వ్యాధిన పడి మరణించింది. ఈ సందర్భంగా మంగళవారం సమాచారం అందుకున్న పట్టణ బెస్త సేవా సంఘం పట్టణ అధ్యక్షులు దత్త శివ, రామ్మోహన్, ఓబుల వెంకటపతి, బెస్త శ్రీనివాసులు, బెస్త వెంకటరమణ, గడ్డం కుమార్, బెస్త అంజి, బెస్త కరుణాకర్ లు ఆ కుటుంబానికి వెళ్లి, భర్త బెస్త రామును పరామర్శించి కుటుంబానికి సంతాపాన్ని తెలుపుతూ, రాజమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం సంఘం తరఫున 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తదుపరి ప్రభుత్వ అధికారులతో కూడా సమస్యను తెలియజేసి, మరింత సహాయం చేయగలమని హామీ ఇచ్చారు.