Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

మాతా- శిశు మరణాలపై సమీక్ష

విశాలాంధ్ర-అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ భవనం లో మాతా – శిశు మరణాల మీద మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(ఎఫ్‌. ఏ. సి.) డా. యుగంధర్‌ ఆధ్వర్యంలో జిల్లా లో జరిగిన రెండు మాతృ మరణాలు, ఆరు శిశు మరణాల మీద సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సంభందిత వైద్యాధికారులు తయారు చేసిన నివేదిక లను పరిశీలించి మరణాల కు గల కారణాలను విశ్లేషించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గర్భిణీ స్త్రీ ల నమోదు ను మూడు నెలల లోపే చేపట్టాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో గర్భవతులలో సాధారణంగా కనిపించే రక్త హీనత, అధిక రక్త పోటు సమస్య ల ను త్వరగా గుర్తించి తగు సూచనలు సంభందిత వైద్యాధికారులు ఎప్పటి కప్పుడు అందించడం ద్వారా మాతృ, శిశు మరణాలను అరికట్టవచ్చు అన్నారు. గర్భవతులు తీసుకోవాల్సిన పౌష్ఠికాహారం గురించి తగు సూచనలు సంభందిత వైద్యాధికారులు తెలపాలన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచనల ప్రకారం సురక్షిత మాతృత్వం, నవజాత శిశువు సంరక్షణ మన అందరి బాధ్యత అని ఏ స్త్రీ జన్మనిస్తూ మరణించ కూడదు అని ఏ శిశువూ మరణించడాని కే జన్మించ కూడదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సుజాత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, డి పి హెచ్‌ ఎన్‌ ఒ లు ఈరమ్మ, ఇందిర లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img