Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాలిటెక్నిక్ విద్యార్థుల విజయ పరంపర

విశాలాంధ్ర -ధర్మవరం : ఈనెల 5వ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనంతపురంలో నిర్వహించబడిన రీజినల్ స్పోర్ట్స్ మీట్ నందులు ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు విజయాన్ని సాధించి పథకాలు గెలుపొందడం పట్ల ప్రిన్సిపాల్ సురేష్ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ రీజినల్ స్పోర్ట్స్ మీట్ నందు మా విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరిచారని అందులో పి. ఏకాంత నాయక్ నూరు మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో ను, ఎస్ అసిఫ్.. జావలిన్ లో బంగారు పతకాన్ని సాధించారని తెలిపారు. అదేవిధంగా సెటిల్ బ్యాట్మింటన్ సింగల్ అండ్ డబుల్ లో ఎస్. అసిఫ్ హుస్సేన్ టీము, వినేష్ టీము విజేతలుగా నిలిచి, పథకాలను అందుకొని, ప్రశంసా పత్రాలతో విజయాన్ని సాధించడం జరిగిందన్నారు. ఇంతటి విజయానికి కారకులైన పిడి. రాజేష్ ను ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందము, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందన, శుభాకాంక్షలు తో హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img