Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

రేషన్ బియ్యం సరఫరా వాహనాలకు దరఖాస్తు చేసుకోండి : తహశీల్దార్ లక్ష్మీనరసింహ

విశాలాంధ్ర-రాప్తాడు : ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఎండియు వాహనాల్లో ఇంటింటా పంపిణీ చేసేందుకు ఆసక్తి గల వారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తహశీల్దార్ లక్ష్మీనరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాప్తాడు మండలానికి ఐదు వాహనాల్లో బియ్యం సరఫరా చేసేందుకు రాప్తాడులో ఉన్న 1, 2, 3 దుకాణాలకు కలిపి ఒక వాహనం, ప్రసన్నాయిపల్లి చిన్మయి నగరుకు సంబంధించి ఒక వాహనం, అయ్యవారిపల్లి బోగినేపల్లి, పాలచెర్ల, గాండ్లపర్తి, జి.కొత్తపల్లి, వరిమడుగు ఒక వాహనం, బండమీద పల్లి మరూరు, చాపట్లకు సంబంధించి ఒక వాహనం, ఎం.చెర్లోపల్లి, పాలభావి, గొల్లపల్లి, కృష్ణాపురం కలిపి ఒక వాహనం లో ఆయా గ్రామాల్లోని రేషన్ దుకాణాల కు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఏడవ తరగతి ఉత్తీర్ణులై , డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి
అర్హులైన ఏ కులస్తులైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నెలకు రూ.18 వేలు వాహన డ్రైవర్ల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు 9701222506 నెంబర్ కు సంప్రదించాలని తహశీల్దార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img