పద్మ అవార్డులు`2022కి ప్రభుత్వం నామినేషన్లు, సిఫారసుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 15ను నామినేషన్ల స్వీకరణకు తుది గడువుగా ప్రకటించింది. నిర్దేశిత ఫార్మాట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొంది.