Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

6న రాష్ట్ర బడ్జెట్‌.. 8న బడ్జెట్‌, పద్దులపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 6న రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 8న బడ్జెట్‌, పద్దులపై చర్చించనున్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించిన విషయం తెలిసిందే. సభకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img