Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అమరరాజా బ్యాటరీస్‌పై
ప్రజాభిప్రాయసేకరణ

సుప్రీంకోర్టు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఏపీకి చెందిన అమరరాజా బ్యాటరీస్‌ వ్యవహారంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతే చర్యలపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మాత్రం యధాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అమరరాజా బ్యాటరీస్‌ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, దీనివల్ల పరిసర ప్రాంతాల జలాల్లో సీసం ధాతువులు పెరుగుతున్నందున సంస్థను మూసివేయాలని ఏపీ కాలుష్య నియం త్రణ మండలి గతంలో ఆ కంపెనీ యాజమా న్యానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్ల వచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అమరరాజా తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయ ణరావు వాదించారు. కేవలం రాజకీయ కారణా లతో రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో పర్యావరణశాఖ అధికారులు ఇప్పటివరకు దాదాపు 34సార్లు నోటీసులు ఇచ్చి కంపెనీ యాజమాన్యాన్ని వేధిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాస్తవానికి కాలుష్య నివారణకు అవసరమైన అన్నిరకాల చర్యలు సంస్థ తీసుకుంటుందని తెలియజేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పం దిస్తూ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై న్యాయ పరిష్కారాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, ఆ తర్వాత జారీ చేసే ఉత్తర్వులను నాలుగు వారాలపాటు నిలుపుదల చేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img