Friday, May 3, 2024
Friday, May 3, 2024

కొత్తవలసలో టీడీపి విజయోత్సవ సభ

విశాలాంధ్ర- పార్వతీపురం: ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు రాయలసీమలో రెండు ఎమ్మెల్సీలను టీడీపీ దక్కించు కోవడంతో నియోజకవర్గం ఐటిడిపి కోఆర్డినేటర్, మాజీ పట్టణ కౌన్సిలర్ బార్నాల సీతారాం, డాక్టర్ భానుప్రసాద్, కొత్తవలస గ్రామంకు చెందిన 8వవార్డ్ కౌన్సిలర్, టిడిపి నేత కోరాడ నారాయణరావుల ఆద్వర్యంలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు.
పట్టుభద్రుల ఘన విజయోత్సవం, కౌన్సిలర్ రెండు సంవత్సరాల విజయోత్సవం, రియల్ టిడిపి యువగలం కార్యక్రమంలను వారంతా కలిసి ఉత్సాహ భరితంగా నిర్వహించారు. పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు ,అభిమానులు తరలివచ్చి,2024 ఎలక్షన్లోఇదే తరహాలో కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని వారంతా తెలిపారు. అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజులు మరింత దగ్గరలో ఉన్నాయని, తెలుగుదేశం కోసం అందరూ పాటుపడి ఘనవిజయం చంద్రన్నకు చూపించాలన్నారు. దానికోసం మనందరం కష్టపడాలని తెలిపారు. యువ గళంతో యువతరం ముందుకు వచ్చిందన్నారు.ఐటీడీపి ఏర్పడ్డాక యువత ప్రత్యేక శ్రద్ద తీసుకొని పనిచేస్తున్నారని సీతారాం, నారాయణరావులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img