Friday, April 26, 2024
Friday, April 26, 2024

జిల్లాలో ఇంటిపన్ను రూ. 4కోట్ల 2లక్షల వసూలు: డి పి ఓ సత్యనారాయణ

విశాలాంధ్ర, సీతానగరం: మన్యం జిల్లాలో ఇంటి పన్నులు రూ.4కోట్ల 86లక్షల డిమాండులో ఇంతవరకు రూ. కోట్ల 2లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగిందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు.గురువారం మండల కేంద్రంలోని పెదబోగిలి మేజర్ పంచాయతీలోని చెత్త సంపద కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ చెత్తసంపద కేంద్రం నిర్వహణ, వానపాముల పెరుగుదల, వ్యర్థ పదార్థాలతోను,చెత్తతో తయారు చేస్తున్న సేంద్రియఎరువులుపట్ల, వర్మీ ఉత్పత్తిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మోడల్ చెత్త సంపద కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.ఆయన మాట్లాడుతూ పార్వతీపురం నియోజక వర్గంలోని గ్రీన్ అంబాడుడర్లకు, పంచాయతీ సర్పంచులకు,కార్యదర్శులకు,ఇంజినీరింగ్, వ్యవసాయశాఖ సహాయకులకు ఈనెల 28, 29తేదీల్లో బ్యాచులవారీగా శిక్షణ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వమిత్వ సర్వేలో భాగంగా గ్రామాలలో ఉండే వ్యవసాయ భూములను సర్వే చేస్తున్న రెవెన్యూ, సర్వే అధికారులు గ్రామకంఠంలోఉండే నిర్మాణాలు, ఖాలీ స్థలాలును సర్వే చేయించడంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈసర్వే పూర్తయ్యాక గ్రామ కంఠంలో ఉండే వాటికి ప్రాపర్టీ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.గ్రామాల్లో బోర్లువద్ద, బావులు వద్ద, రక్షిత మంచినీటి పథకాల వద్ద క్లోరినేషన్ చేయించాలని ఆయన తెలిపారు. గ్రామాలలో ఎక్కడైనా విద్యుత్ బల్బులు వెలగని యెడల వెంటనే పంచాయతీ సర్పంచులు దృష్టి సారించి బల్బులు వేయాలని తెలిపారు.గ్రామాల్లో త్రాగునీరు, క్లోరినేషన్,వీదిలైట్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 15వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించి పనులు చేయాలని కోరారు. గ్రామాలలో ఇంటి పన్నులు వసూలు వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు.దీంతో పాటు గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు కూడా ఈనిధుల నుండే చెల్లించాలని కోరారు. ఈకార్యక్రమంలోఈఓపిఆర్డీ వర్మ, పంచాయతీ ఈఓ వెంకటరావు, గుమస్తా రమేష్, గ్రీన్ అంబాసిడర్ గౌరీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img