Friday, May 3, 2024
Friday, May 3, 2024

జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఆద్వర్యంలో స్పందన

విశాలాంధ్ర – పార్వతీపురం : జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ డాక్టర్ ఓ.దిలీప్ కుమార్ స్పందన కార్యక్రమంను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అదేశాలు మేరకు సోమవారం నిర్వహించారు. దీనిద్వారా 11స్పందన పిర్యాదులు స్వీకరించగా, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లాఅదనపుఎస్పీ ఆదేశించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజలవినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో మాట్లాడి వారియొక్క సమస్యలన చట్టప్రకారం విచారణజరిపి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈస్పందనకార్యక్రమంలో
ఏఆర్ డిఎస్పి బి. నాగేశ్వరరావు, ఎస్బి సిఐ ఎన్ శ్రీనివాసరావు, డిసిఆర్ బి, ఎస్ ఐ. పి. దినకర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img