విశాలాంధ్ర-గుంతకల్లు : పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఆలయ ఈవో వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో హుండీలు తెరచి లెక్కింపు చేశారు.అందులో రూ.43,10,744 /-లు, అన్నప్రసాదం వితరణ హుండీ ద్వారా రూ.52,260 /-లు నగదు, బంగారు-000-004 గ్రాములు -000 మిల్లీ గ్రాములు, వెండి-001 కేజీ -309 గ్రాములు – 000 వచ్చిందని తెలిపారు.(ఈ మొత్తము తేది.07.02.2023 నుండి తేది.27.03.2023 వరకు అనగా 49 రోజులకు గాను వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమములో ఆలయ దర్మకర్త సుగునమ్మ, దేవదాయ ధర్మాదాయశాఖ పర్యవేక్షకులు, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, కసాపురం బ్రాంచ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది,
ఆర్.టి.సి. సేవాసమితి, వీరభద్ర సేవాసమితి సభ్యులు, బళ్ళారి వారు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.