Friday, May 3, 2024
Friday, May 3, 2024

అనాధ పిల్లలకు అల్పాహారం ఏర్పాటు

విశాలాంధ్ర-తాడిపత్రి: మండలంలోని ఆవుల తిప్పాయపల్లి గ్రామంలో ఉన్న రమణ మహర్షి అనాధ పిల్లల ఆశ్రమం నందు మిషన్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే నివాళు లర్పించారు. అనంతరం ఆశ్రమం లోని పిల్లలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శతజయంతి సందర్భంగా అల్పాహారం ఏర్పాటు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున పుట్టినటు వంటి బాలనరసింహులు, ప్రభావతి కుమారుడు డాక్టర్.మాధవ నరసింహ జన్మదినం సందర్భంగా అనాధ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి‌‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్ యొక్క గొప్పతనం, విశ్వవ్యాప్తమని ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి అంబేద్కర్ చేసిన సేవలకు కృతజ్ఞతగా ఉండాలని మానవాళికి ఆయన సేవలు అజరామమని తెలిపారు. ఈ కార్య క్రమంలో మిషన్ ఎడ్యుకేషన్ సంస్థ అధ్యక్షులు బాల నరసింహులు, ప్రధాన కార్యదర్శి గంగరాజు, కోశాధికారి కంబగిరి స్వామి, ఈఓపిఆర్డి శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు, ప్రభావతి, బాల ఓబులు, రంగయ్య, రామాంజనేయులు, గంగాధర, సుబ్బరాయుడు, రంగస్వామి, శివయ్య సుంకన్న, మనోహర, పెన్నా ప్రభాకర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img