Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జగన్ పాలనలో ప్రజల గుండెల్లో నిలిచిపోయే పథకాలు

మున్సిపల్ కౌన్సిలర్ బళ్ళారి నాగేష్

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని 31 వ వార్డులో జగనన్నే మాభవిష్యత్, నువ్వే మానమ్మకం జగన్ కార్యక్రమాన్ని అవార్డు కౌన్సిలర్ బళ్లారి నాగేష్ ప్రారంభించారు.గురువారం పట్టణంలోని 31 వ వార్డులో గృహ సారధులతో కలసి పలు ఇళ్లకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా బళ్లారి నాగేష్ మాట్లాడుతూ…చంద్రబాబు ప్రభుత్వానికి సీఎం జగన్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు స్వయంగా తెలియజేశారు.  వైఎస్‌ జగన్ అధికారం చేపట్టాక రూపాయి అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారధులు,వార్డు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img