Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు వెంటనే పూర్తి చేయాలి…

హౌసింగ్ ఈఈ. చంద్రశేఖర్, డి ఈ. మునీశ్వర నాయుడు
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదింటి వారి సొంతింటి కలను నిజం చేసేందుకు, ఇప్పటివరకు ఇంటి పట్టాలు పొందిన వారు తొందరలోనే పూర్తి దశలో ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని హౌసింగ్ ఈ ఈ. చంద్రశేఖర్, డిఈ. మునీశ్వర నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుల నాగేపల్లి లేఔట్ లో బుధవారం నాడు అధికారులు గ్రౌండింగ్ మేళాను నిర్వహించి నేరుగా లబ్ధిదారులతో ఇంటి నిర్మాణ విషయంలో తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలకు పరిష్కారాలను కూడా చూపడంతో లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఈ గ్రౌండ్ మేళ గురువారం కూడా ఉంటుందని తెలిపారు. అనివార్య కారణాల వలన రాని లబ్ధిదారులు తప్పనిసరిగా రావాలని తెలిపారు. ఇంకనూ పెండింగ్ లో ఉన్న పునాది, గుంత, గోడలు, వేసిన వాళ్ళు పూర్తి దశలో అనుకున్న సమయంలో ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ప్రతి లబ్ధిదారుడు టాప్ లెవెల్ వరకు ఇంటి నిర్మాణం కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సర్వే జరిపి ఆ ఇంటి పట్టాను రద్దు చేయడంతో పాటు తిరిగి అర్హత గల పేదవారికి ఆ ఇంటి పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను నిజం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ. బాలాజీ, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, అమీనాష్ కార్యదర్శులు, సచివాలయ ప్లాన్ సర్వేయర్ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img