విశాలాంధ్ర -ధర్మవరం : విద్యుత్ విభాగంలో సర్దుబాటు చార్జీల విధానమును వెంటనే రద్దు చేయాలని కోరుతూ, శుక్రవారం స్థానిక కరెంటు ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని సిపిఐ, సిపిఎం నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు, పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున, సిపిఐ కార్యదర్శి రవికుమార్, మాట్లాడుతూ
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై సర్దుబాటు చార్జీల పేరుతో వేలకోట్ల రూపాయలు భారాలు మోపడం దారుణమన్నారు. విద్యుత్ రంగాన్ని ఆదాని తదితర బడా కార్పెట్ కంపెనీలకు కట్టబెడుతున్నారనీ,. మన రాష్ట్రంలో 30 సంవత్సరాల పాటు వ్యవసాయానికి అందించే విద్యుత్ మొత్తం తయారు చేసే ఒప్పందం ఆదాని చేసుకున్నారనీ, అందులో భాగంగానే తాజాగా స్మార్ట్ మీటర్లు చేసే కంపెనీని ఆదాని ప్రారంభించారని తెలిపారు. తద్వారా విద్యుత్ రంగం మొత్తాన్ని ఆదాని కార్పోరేట్ల గుప్పెట్లో వెళ్ళిపోతుందని, మోడీ ,జగన్ కలిసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని,రెండు మూడు రూపాయలకు కొనాల్సిన విద్యుత్ ను బహిరంగ మార్కెట్లో 10 నుండి 20 రూపాయలకు కొంటున్నారాని ప్రభుత్వాలపై మండిపడ్డారు.ఇటీవలే నిబంధనలకు విరుద్ధంగా హిందూజ సంస్థకు 1200 కోట్ల రూపాయలు అప్పనంగా చెల్లించారని,రేపో, మాపో సర్దుబాటు చార్జీల పేరుతో మళ్లీ ఈ భారం వేయడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగించి, ఉచిత విద్యుత్ ఎసరు పెట్టబోతున్నారనీ,. 200 యూనిట్లు లోపు వాడే వారందరికీ ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారాని,ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ను క్రమంగా నీరు కార్చడం జరుగుతోందన్నారు. మున్సిపాలిటీలలో వాడే కరెంటు బిల్లులు పరోక్షంగా జనం నెత్తినె పడతాయనీ , కావున ,రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణం పెంచిన విద్యుత్ చార్జీలను ,సర్దుబాటు చార్జీల విధానము ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేశారు. ట్రూ అఫ్ చార్జీలు వసూలు వెంటనే నిలిపివేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టరాదు అని డిమాండ్ చేశారు. అనంతరం ట్రాన్స్కో ఏఈకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భాష, సిఐటియు నాయకులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆదినారాయణ,ఆయుబ్ ఖాన్, నాయకులు అన్నం సూరి, బాలాజీ, నాగేంద్ర, షేక్షవాలి, సిపిఐ సహాయ కార్యదర్శి రమణ, చేనేత సీనియర్ నాయకులు భుజంగం, చేనేత నాయకులు వెంకటస్వామి, వెంకటరమణ, ఏఐఎస్ఎఫ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.