624.7 బిలియన్ డాలర్లకు విదేశీ అప్పు
ముంబై: మన దేశం రుణభారతంగా మారిపోగా అప్పులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రుణజీడీపీ తగ్గినప్పటికీ 2023 మార్చి ముగిసేనాటికి వార్షిక విదేశీ రుణం 624.7 బిలియన్ డాలర్లుగా ఉందని భారత రిజర్వు బ్యాంకు శుక్రవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2022 మార్చి చివరికి 619.1 బిలియన్ డాలర్లుగా ఉన్న రుణం మరో 5.6 బిలియన్ డాలర్లు పెరిగినట్లు అందులో తెలిపింది. 2023 మార్చి చివరికి విదేశీ రుణం
జీడీపీ నిష్పత్తి 18.9శాతానికి తగ్గిందని, అంతకుముందు ఏడాది 20శాతంగా ఉందని ఆర్బీఐ వెల్లడిరచింది. మూల్యాంకనం ప్రభావాన్ని మినహాయిస్తే విదేశీ రుణం 2023 మార్చి చివరికల్లా 5.6 బిలియన్ డాలర్లకు బదులు 26.2 బిలియన్ డాలర్లకు పెరిగి ఉండేదని తెలిపింది. దీర్ఘకాలిక రుణం (ఏడాదికిపైగా మెచూరిటీ కాలం ఉన్నవి) 496.3 బిలియన్ డాలర్లుగా ఉంటే 2022 మార్చి చివరికి ఉన్న మొత్తంతో పోల్చితే 1.1 బిలియన్ డాలర్లు తగ్గిందని నివేదిక పేర్కొంది. స్వల్పకాలిక రుణవాటా మొత్తం 20.6శాతానికి పెరుగగా 2022 మార్చి చివరికి 19.7శాతంగా ఉంది. అదే విధంగా విదేశీ మారక నిల్వలకు సంబంధించి స్వల్ప కాలిక రుణ నిష్పత్తి 22.2శాతం పెరిగింది. డాలర్లలో ఉన్న అప్పు భారత్కు సమస్యగా మారిందని ఆర్బీఐ తెలిపింది. 2023 మార్చి ముగిసే నాటికి విదేశీ రుణవాటా 54.6శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇక భారతీయ రూపాయల్లో ఉన్న రుణం 29.8శాతంగా ఉంటే ఎస్డీఆర్ (6.1శాతం), యెన్ (5.7శాతం), యూరో (3.2శాతం)గా ఉన్నట్లు వెల్లడిరచింది. విదేశీ రుణంలో లోన్ల వాటా (32.5శాతం) ఎక్కువ కాగా కరెన్సీ, డిపాజిట్లు (22.6శాతం), ట్రేడ్ క్రెడిట్, అడ్వాన్స్లు (19.9శాతం)గా ఉన్నాయి.