Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నేడు దిల్లీకి చంద్రబాబు

. బీజేపీ అగ్రనేతలతో భేటీ
. ఎన్నికల పొత్తుపై చర్చించే అవకాశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు బుధవారం దిల్లీ పర్యటన ఖరారైనట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం రాత్రి అమరావతి నుంచి దిల్లీ వెళ్లనున్న చంద్రబాబు… బీజేపీ జాతీయ నేతలతో విడివిడిగా సమావేశం కాను న్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు దిల్లీ టూర్‌ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన చంద్రబాబు… ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పోటీ చేసే అభ్యర్థుల జాబితా విషయంలో స్పష్టత రాలేదు. బీజేపీతో పొత్తు వల్ల నష్టం జరుగుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తుండగా… జనసేన మాత్రం బీజేపీని కలుపుకువెళ్లాలన్న పట్టుదలతో ఉంది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు సముఖతతో ఉన్నారు. ఇదే విషయాన్ని వారు జాతీయ నేతల దృష్టికి తీసుకె ళ్లారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా బీజేపీకి మద్దతివ్వడానికి అంగీకరిస్తుందే తప్ప… బహిరంగ ఎన్నికల పొత్తుకు ముందుకు రావడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా ముస్లిం ఓటింగ్‌ కోల్పోవాల్సి వస్తుందని వైసీపీ భయపడుతోంది. అందువల్ల టీడీపీ, జనసేనతో పొత్తు అనివార్యమని, లేనిపక్షంలో ఒకశాతం ఓట్లు కూడా లేని బీజేపీకి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు తమ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పొత్తు కోసం చంద్రబాబుపై బీజేపీ జాతీయనేతలు ఒత్తిడి పెంచుతున్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబు దిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. దిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎవరిని కలుస్తారు? బీజేపీతో పొత్తుకి అంగీకరిస్తారా ? లేక తర్వాత మద్దతిస్తామని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారా ? అనేది తేలాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img