Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

సీతానగరం ఏ.ఎస్ఐ కుమారస్వామి మృతి

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక పోలీస్ స్టేషన్లో ఏ.ఎస్ఐగా పనిచేస్తున్న బిడ్డిక కుమార స్వామి ( 61) శుక్రవారం మృతిచెందారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. గత ఏడాది జూన్లో ఆయన సీతానగరం బదిలీపై వచ్చారు.గతంలో కూడా ఆయన సీతానగరంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు.రానున్న జూన్లో పదవీ విరమణ చేయాల్సిఉంది. ఆయన మంచివ్యక్తిగా,సౌమ్యునిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనస్వగ్రామం గుమ్మలక్ష్మిపురం మండలం రెల్లగ్రామానికి చెందినవారు. బొబ్బిలిలో మృతిచెందిన కుమారస్వామి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో జరగనున్నాయి. ఆయనకు అంత్యక్రియల నిమిత్తం 25వేల రూపాయలను జిల్లా ఎస్పీ విడుదల చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుమారస్వామి మృతిపట్ల సీఐ రవికుమార్, ఎస్ఐ రాజేష్,సీతానగరం,పార్వతీపురం పోలీస్ సిబ్బంది ప్రగాఢసంతాపాన్ని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img