ఈ నెల 9వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలో, ఒడిశాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని, 8,9 తేదీల్లో మహారాష్ట్ర, గుజరాత్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర భారతదేశంలోని హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ రీజియన్తో పాటు ఈస్ట్ రాజస్థాన్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.