Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

16,347 పోస్టులు

. మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం
. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై మలి సంతకం
. జులై నుంచి పెన్షన్లు రూ.4 వేలకు పెంపు
. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ`నైపుణ్యగణన ప్రారంభం
. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు హామీలపై సంతకాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎన్నికల హామీల్లో భాగంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. కేసరపల్లిలో ప్రజల సమక్షంలో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు…గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటిబ్లాక్‌లోని తన ఛాంబర్‌లో సతీమణి భువనేశ్వరితో కలిసి వేదపండితుల మంత్రోచ్ఛా రణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు మొత్తం 5 హామీలకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. వాటిలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ పోస్టులు కేటగిరీల వారీగా ఎస్‌జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్‌ అసిస్టెంట్స్‌ 7725, టీజీటీ 1781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్‌ 52 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం చేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 సంవత్సరాలకే సామాజిక పింఛన్లు నెలకు రూ.4 వేలకు పెంచుతామని చెప్పిన హామీ అమలుకు సంబంధించిన దస్త్రంపై మూడో సంతకం పెట్టారు. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు 3 వేలు పెన్షన్‌ చెల్లిస్తున్నారు. వికలాంగులకు రూ.3,500 ఇస్తున్నారు. ఎన్నికల సందర్భంగా…టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏప్రిల్‌ నెల నుంచే 4 వేలు చెల్లిస్తామని, జులైలో 4వేలతో మూడు నెలల బకాయి కలిపి మొత్తం రూ.7 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వికలాంగులకు నెలకు 6 వేలు చెల్లించనున్నారు. వారికి కూడా మూడు నెలల బకాయి కలిపి చెల్లించనున్నారు. నాల్గవ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌్‌ కుమార్‌ ప్రసాద్‌, సీఎం ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఎస్‌.సవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు.
చంద్రబాబుని కలిసేందుకు వివాదాస్పద అధికారుల యత్నం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సచివాలయానికి విచ్చేసిన చంద్రబాబును కలిసేందుకు వివాదాస్పద ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు క్యూ కట్టారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అజయ్‌ జైన్‌, శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సునీల్‌ కుమార్‌, కేవీవీ సత్యనారాయణ తదితరులు చంద్రబాబు రాగానే సచివాలయం మొదటి బ్లాక్‌ వద్దకు పరుగులు పెట్టారు. గతంలో ఆయనకు వ్యతిరేకంగా అజయ్‌ జైన్‌ సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాటి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పూర్తి స్థాయిలో సహకరించారనే అభియోగాలు ఉన్నాయి. జగన్‌, సీఎంవో అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మిపై ఆరోపణలున్నాయి. ఆర్థికశాఖలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని, వైసీపీ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపారన్న ఆరోపణలు కేవీవీ సత్యనారాయణపై ఉన్నాయి. టీడీపీ నేతలు పదేపదే ఆరోపణలు చేసిన ఇటువంటి వివాదాస్పద అధికారులంతా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img