విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతి మాజీ డైరెక్టర్, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఊకా అశ్వత్థ నారాయణ శుక్రవారం ఆకస్మిక మృతి చెందారు. ఈ సందర్భంగా కళాజ్యోతి కార్యవర్గం గౌరవ అధ్యక్షులు వెంకటనారాయణ, అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి రామకృష్ణ, డైరెక్టర్లు వారి స్వగృహానికి వెళ్లి, పూలమాలవేసి, శ్రద్ధాంజలి ఘటించి కుటుంబానికి సంతాపమును తెలియజేశారు. ఈ సందర్భంగా కళాజ్యోతి కార్యవర్గం వారు మాట్లాడుతూ ఊక అశ్వత్త నారాయణ కళాజ్యోతికి ఎనలేని సేవలు చేయడం జరిగిందని, వారి సేవలు మరుపు రానివని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనవహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సింగనమల రామకృష్ణ, జగ్గా వేణుగోపాల్, సుంద రేషన్, రమేష్ బాబు, పళ్లెం వేణుగోపాల్, పెద్దారెడ్డి, రాంప్రసాద్, మధుసూదన్, గూడూరు మోహన్ దాస్, తదితరులు పాల్గొన్నారు.