బుక్కపట్నం డైట్ ప్రిన్సిపాల్ రవి సాగర్
విశాలాంధ్ర ధర్మవరం;; ఆధునిక విద్యా వ్యవస్థను సరళీకృతం చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వము ఉపాధ్యాయులకు తగిన రీతిలో శిక్షణ ఇస్తున్నట్లు బుక్కపట్నం డైట్ ప్రిన్సిపల్ రవి సాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా
టీచ్ టూల్ అబ్జర్వేషన్ ట్రైనింగ్ లో భాగంగా ఆయన తనిఖీ చేశారు.
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరం భవనంలో జరుగుతున్న 9 రోజుల శిక్షణ తరగతులను ఆయన తనిఖీ చేశారు. ధర్మవరం డివిజన్ కు సంబంధించిన హెడ్మాస్టర్లు,ఉపాధ్యాయులు ఈ ట్రైనింగ్ కు హాజరర్ అయ్యారు. దాదాపు 110 మంది టీచ్ టూల్ అబ్జర్వర్లుగా ఈ ట్రైనింగ్ లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ
టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రపంచంలో 38 దేశాల్లో అమల్లో ఉందని ఈ విధానం పట్ల ఇప్పటివరకు 6 మిలియన్ల బడి పిల్లలు లబ్ధి పొందారని, అందులో భాగంగా వరల్డ్ బ్యాంక్ నిర్వహించబోతున్న సాల్ట్ ప్రోగ్రాం లో భాగంగా ఎస్సీఈఆర్టీ , సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ అబ్జర్వర్ ట్రైనింగ్ లో లబ్ధి పొందిన అబ్జర్వర్తో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంద ని, తద్వారా ఆధునిక విద్యా విధానంలో
తరగతి గదిలో అబ్జర్వర్లు అందరి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ జరిపి, ఆన్లైన్లో నమోదు చేయుటకు పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ పరిశీలన షెడ్యూల్ అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
అబ్దుల్ మాలిక్- సిఎంఓ,
రాజేశ్వరి దేవి- ఎంఈఓ,
డిస్టిక్ ఇంచార్జ్ , టీచ్ టూల్ అబ్జర్వర్లు ,ప్రధాన ఉపాధ్యాయులు అస్లం భాష పాల్గొన్నారు.