విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం) 2017 సంవత్సరంలో ఏప్రిల్ 7న 120 కోట్లతో టిడిపి ప్రభుత్వం పరిపాలన భవనం, లెక్చరర్ హాల్ కాంప్లెక్స్, ఫార్మసీ బిల్డింగ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని జేఎన్టీయూ అధికారులు దాచి పెట్టారు. శిలాఫలకాన్ని యధా స్థితిలో జేఎన్టీయూ ఏ ఇన్చార్జి వీసీ ఆచార్య సుదర్శన్ రావు శనివారం పరిపాలన భవనంలో పునర్నిర్మానం చేశారు. విశ్వవిద్యాలయానికి పరిపాలన భవనం, వసతి గృహాల పునరుద్ధరణ లేక సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం మార్గాలను చూపి విశ్వవిద్యాల నిర్మాణానికి వేగవంతంగా నిధులు అందజేయడంతో నాడు 90 శాతం పనులను పూర్తి చేయగలిగేమన్నారు. మిగిలిన 10% శాతం వైకాపా ప్రభుత్వం మూడు సంవత్సరాల అనంతరం రంగులు వేసి పరిపాలన భవనం లో శిలాఫలకాలను వేసుకున్నారు. వైకాపాకు వీరవిజయతను చాటుతున్న కొందరు ఆచార్యులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు శిలాఫలకాన్ని సైతం దాచిపెట్టి.. తమదైన పెత్తందారీ వ్యవస్థను నడిపిన ఘనత జెఎన్టియులో చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయాల అభ్యున్నతకు, విద్యార్థుల పరిశోదాత్మక, ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉన్న అనంతపురం జెఎన్టియును లో సిమెన్స్ స్కిల్ శిక్షణను 16000 మందికి ఇచ్చి పారిశ్రామిక రంగాలలో ఉపాధి కల్పన అందించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వీసీ పేర్కొన్నారు.