Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు నామినేషన్ కు సిద్ధంకండి

వైకాపా మండల అధ్యక్షుడు రవి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఈనెల 19న (శుక్రవారం) పాడేరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు నామినేషన్ వేయనున్నారని, ఈ నామినేషన్ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అభిమానులు అంతా సిద్ధం కావాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం వైకాపా అభ్యర్థిగా మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఈనెల 19న నామినేషన్ వేయనున్నారన్నారు. ఆయన నామినేషన్ ప్రక్రియకు మండలంలోని ప్రతి గ్రామం నుండి వైకాపా నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ లోతుగెడ్డ సచివాలయ కన్వీనర్ శ్రీరాములు, యువ నాయకుడు యేసేపు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img