Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

పెట్రోల్ బంకులో ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోండి..

స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఉచిత సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మంచినీటి వసతి అందుబాటులో ఉంటుందని, మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా ఉపయోగించుకోవచ్చునని, ప్రతి వాహనానికి టైలర్ లో గాలి ఉచితంగా నింపుకోవచ్చునని, ఫిర్యాదులు పెట్టే, ఫస్ట్ ఎయిడ్ కిట్టులను కూడా ఉపయోగించుకోవాలని, వినియోగదారులు పెట్రోలు డీజలు నాణ్యత తెలుసుకునేందుకు అక్కడ అనుకూలంగా ఉండే పరికరాలతో పరీక్షలు కూడా చేయించుకోవచ్చు అని తెలిపారు. పై వాటిలో ఏ సౌకర్యము లేకున్నా పెట్రోల్ బంక్ యజమానుల నిర్లక్ష్య సమాధానమిచ్చిన, చమురు మార్కెట్ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకొని చక్కటి సేవలను పొందాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img