Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

కర్ణాటక మద్యం సీజ్.. ఒక ముద్దాయి అరెస్ట్.. సేబ్ ఇన్స్పెక్టర్ గురు ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో సెబ్ పోలీసులు దాడులు చేయగా, దివాకర్ అనే వ్యక్తి వద్ద నిల్వ ఉంచిన 480 టెట్రా కర్ణాటక ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, దివాకర్ ను అరెస్టు చేసి,స్టేషన్కు తరలించడం జరిగిందని సబ్ ఇన్స్పెక్టర్ గురు ప్రసాద్ తెలిపారు. ఈ టెట్రా ప్యాకెట్ల విలువ 30 వేల రూపాయలు విలువ చేస్తుందని తెలిపారు. అనంతరం గురు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా ప్రజలందరికీ అక్రమంగా మధ్యము, నాటు సారాయి కలిగివున్న లేదా అమ్మిన యెడల కఠిన చర్యలు తీసుకొనబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెబ్ ఇన్స్పెక్టర్ రాజన్న, సిబ్బంది రమేష్ బాబు, శ్రీనివాసులు, జవహర్, కిరణ్ కుమార్, మల్లికార్జున, అరుణ, గిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img