Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

అందరికీ మంచి చేయడమే నా అభి”మతం”

మజ్జిగ చలివేంద్రం ఏర్పాటుతో వేసవి తాపాన్ని తీరుస్తున్న మస్తాన్ (గవాజీ)

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అమ్మ ఆశయ సాధన, అందరికీ మంచి చేయాలన్న తపనే తన అభి”మతం”అని షేక్ మస్తాన్ (గవాజీ) అన్నారు. ఎండలు మండుతున్న తరుణంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చెల్లించిన ఆయన ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే తన తల్లి స్వర్గీయ మస్తాన్ బి ఆశయ సాధన కోసం ప్రజల వేసవి తాపాన్ని తీర్చే సదుద్దేశంతో సోదరులు, కుటుంబ సభ్యులతో కలిసి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవికాలంలో దాహార్తిని తీర్చుకునేందుకు త్రాగునీటి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆయన మరో ముందడుగు వేసి దాహార్తి తీరడంతో పాటు శరీరం డీ హైడ్రేషన్ కాకుండా, ఆరోగ్య వంతంగా ఉండాలనే లక్ష్యంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సదవశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img