Friday, May 3, 2024
Friday, May 3, 2024

ప్రతి పేదవాడు సంతోషంగా జీవించాలంటే మళ్ళీ వైకాపా ప్రభుత్వం రావాలి

సర్పంచ్ పుష్పలత

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- ప్రతి పేదవాడు సంతోషంగా జీవించాలంటే మళ్లీ వైకాపా ప్రభుత్వమే అధికారంలోకి రావాలని, జగనన్నే ముఖ్యమంత్రి కావాలని, అందు కోసం వైకాపా బలపరిచిన పాడేరు శాసనసభ, అరకు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయుచున్న మత్స్యరాస విశ్వేశ్వర రాజు, గుమ్మ తనూజ రాణి లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. మండలంలోని స్థానిక పంచాయతీకి చెందిన చిన్నగెడ్డ, కందుల గాది గ్రామాలలో వాలంటీర్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు వేములపూడి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో వైకాపా మండల అధ్యక్షుడు మోరి రవి, కో ఆప్షన్ మెంబర్ షేక్ నాజర్ వల్లి లతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న గడచిన ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రతి పథకాన్ని లబ్ధిదారుని చెంతకు చేర్చిన ఏకైక ప్రభుత్వం వైకాపా అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా పక్షపాతిగా ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశారన్నారు. అవినీతి రహిత పాలన అందించడంతోపాటు ప్రతి లబ్ధిదారునికి వ్యక్తిగత ఖాతాలో నగదు జమ చేసిన ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. అటువంటి ముఖ్యమంత్రిని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పాడేరు అరకు శాసనసభ స్థానాలతో పాటు పార్లమెంట్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవలసిన అవసరం ఉందన్నారు. సంక్షేమం పొందిన ప్రతి ఒక్కరూ వైకాపా అభ్యర్థులను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు చిట్టి బాబు, వెంకట లక్ష్మి, రాణి, కామాక్షి, ఎస్ సి సెల్ అధ్యక్షులు నాగేష్, ఎస్ సి సెల్ మహిళా అధ్యక్షురాలు సోమరాజు, పార్టీ నాయకులు దారబాబు, అప్పారావు, రాంబాబు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img