Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

సందడిగా కూటమి అభ్యర్థుల నామినేషన్‌

భారీ ర్యాలీ మధ్య అభ్యర్థుల నామపత్రాల సమర్పణ
హాజరైన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత
విశాలాంధ్ర -పాడేరు: ఏజెన్సీ పరిధిలోని కూటమి అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారం సందడిగా జరిగింది. ఈ సందర్భంగా పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంతో పాటు అక్కడి కలెక్టరేట్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. అరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కిల్లో రమేష్‌ నాయుడు పాడేరులో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత హాజరై అభ్యర్థుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా హుకుంపేట మండలం గడుగుపల్లి నుంచి వందలాది వాహనాలతో భారీ బైక్‌ ర్యాలీ సాగింది. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన కూటమి అభ్యర్థులకు ఉమ్మడి పార్టీల శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల అభిమానులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రచార రథం నుంచి అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ప్రజలకు అభివాదాలు చేస్తూ కమలం, సైకిల్‌ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా కొత్తపల్లి గీత అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img