Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థులు రెండవ జాబితా విడుదల

భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజబాబు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- భారత్ ఆదివాసీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేయడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుని ఆదేశాల మేరకు అల్లూరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ స్థానానికి డాక్టర్ గోకురుబోయిన సీతరత్నం, మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గానికి మండంగి పోలిరాజు లను అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలపడం జరుగుతుందని గిరిజన చట్టాలు హక్కుల రక్షణకై తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు డాక్టర్ పి రామకృష్ణ, రాష్ట్ర కోశాధికారి మర్రిచెట్టు పోతురాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img