కదిరి యాదవ సంఘం
విశాలాంధ్ర` కదిరి. … అక్రమ అరెస్టులు చేస్తే ఉద్యమకారులను ఆపలేరని కదిరి యాదవ సంఘం నాయకులు పేర్కొన్నారు.ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేస్తున్నందుకు, రైతుల కోసం ఉద్యమిస్తున్నటువంటి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ నాయకులు రామచంద్ర యాదవ్ తలపెట్టిన రైతుభేరి సభకు అనుమతి ఇవ్వకుండా ఆయనపై ,ఆయన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా నేడు జరిగే ఛలో పుంగనూరు కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా కదిరి యాదవ సంఘ నాయకులు సూర్యనారాయణ యాదవ్ , శ్రీరాములు యాదవ్, చంద్ర యాదవ్, నరేంద్ర యాదవ్, యాదవ సంఘ నాయకులను కదిరి పోలీస్ అధికారులు అక్రమంగా అరెస్టులు చేశారు.అక్రమ అరెస్టుల వల్ల మా ఉద్యమాలు అగవు అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమకారుల నోరు మూయించ లేరని ఆవేదన వ్యక్తం చేశారు.