Friday, April 26, 2024
Friday, April 26, 2024

భోజన నాణ్యత తప్పనిసరిగా అమలు చేయాలి.. ఎంఈఓ సుధాకర్‌ నాయక్‌

విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు భోజన పంపిణీ విషయములో నాణ్యత తప్పక పాటించాలని ఎంఈఓ సుధాకర్‌ నాయక్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం వారు మండల పరిధిలోని నాగలూరు, గొట్లురు, బడన్నపల్లి పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ తరగతులు లోని విద్యా బోధనను వారు పరిశీలించారు. ప్రతి ఉపాధ్యాయుడు టిఎల్‌ఎం లెసన్‌ పద్ధతిని ఉపయోగించి, విద్యార్థులకు బోధించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు పెట్టిన పరీక్షల యొక్క గుణాలను రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. సకాలంలో సిలబస్ను పూర్తి చేసి, విద్యార్థుల ప్రగతిపై తప్పనిసరిగా దృష్టి సారించారని సూచించారు. ప్రతినెల పోషకుల సమావేశాన్ని పాఠశాలలో నిర్వహించి పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ నుండి ఏదైనా ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎంఈఓ భోజనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img