Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆధార్ను అప్డేట్ చేసుకోవడం విద్యార్థులకు ప్రయోజనకరం.. డివి ఈవో రఘునాథరెడ్డి

విశాలాంధ్ర-ధర్మవరం : ఆధార్ ను అప్డేట్ చేసుకోవడం ఇంటర్ కళాశాల విద్యార్థులకు మరింత ప్రయోజనం ఉంటుందని డివి ఈవో రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వేలిముద్రలు, పేర్లు, చిరునామాలను సరిచేసుకునే అవకాశం ఉందని, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థులందరికీ కూడా ఆధార్ అప్డేట్ చేయడం సంతోషదాయకమని తెలిపారు. విద్యార్థుల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆధార్ సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేయబడుతుందని తెలిపారు. గతంలో మీసేవ, ఆధార్ సెంటర్ల వద్ద విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడే వారిని, ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల వద్దకే వచ్చి, వారి యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేయడం శుభదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి ఎల్సికేపురం సచివాలయ సూపర్వైజర్ రామ్మోహన్, మహిళా పోలీస్ సర్వశ్రీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img