Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఈ ఆఫీస్ సర్వీస్ ద్వారానే కార్యాలయ పనులను వేగవంతం చేస్తాం.. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర -ధర్మవరం : ఈ ఆఫీస్ సర్వీస్ ద్వారానే మున్సిపాలిటీ కార్యాలయ పనులను మరింత వేగవంతం చేస్తామని, ఇప్పటికే శ్రీ సత్య సాయి జిల్లాలో గల మున్సిపాలిటీలలో ధర్మవరం మున్సిపాలిటీ మొట్టమొదటి స్థానంలో కలదని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాలులో మున్సిపల్ కార్యాలయ అధికారులకు సిబ్బందికి ఈ ఆఫీస్ సర్వీస్ అనే కార్యక్రమాన్ని శ్రీ సత్య సాయి జిల్లా ఎన్ఐసి కలెక్టరేట్ టెక్నికల్ అసోసియేట్ రవికృష్ణ ద్వారా ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు సేవలు అందించే వివిధ విభాగములలో అన్నింటినీ కూడా పేపర్ లెస్ ద్వారానే కంప్యూటర్లో ఇప్పటికే నమోదు చేయడం జరుగుతుందని, మరింత నైపుణ్యంతో ముందుకు వెళ్లడానికి కార్యాలయ సిబ్బందికి ఈ శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పేపర్ లెస్ ద్వారానే, కంప్యూటర్ లోనే మొత్తం పరిపాలన విధానాన్ని చేయడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో పలు అనుమానాస్పద అంశాలకు రవి కృష్ణ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆనంద్, అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ విభాగం ఈఈ. సత్యనారాయణ ,టిపిఓ రెహమాన్, వివిధ విభాగముల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img