Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

ట్రస్టు వైస్ చైర్మన్ వసికేరి మల్లికార్జున

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ పట్టణ కేంద్రంలోని శ్రీ వాణి విద్యా నికేతన్ పాఠశాల నందు దివంగత మాజీ ఎమ్మెల్యే వసికేరి గోపీనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ తేదీ బుధవారం నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్టు వైస్ చైర్మన్ వసకేరి మల్లికార్జున పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో కార్మికులను కలిసి వైద్య శిబిరం యొక్క ప్రత్యేకత గురించి వివరించారు. శాంతారాం ఆస్పత్రి వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రధానంగా గుండె, కంటి ఆపరేషన్లు,మరియు మోకాలు, భుజము, మెడకు సంబంధించిన సమస్యలకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు కూడా ఉచితంగానే నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి వచ్చే వారికి మరియు ఆపరేషన్లకు  సంబంధించి మిగతా సదుపాయాలు అన్నీ కూడా ఉచితంగానే అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు బసవరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img