విశాలాంధ్ర-ధర్మవరం : స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయ సాధనాలకు అందరూ కృషి చేయాలని టిడిపి నాయకులు కమతం కాటమయ్య ,పని కుమార్, బోయ రవిచంద్ర, పురుషోత్తం గౌడ్, పరిసే సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం స్వర్గీయ ఎన్టీఆర్ 27వ వర్ధంతి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం పాండురంగ స్వామి గుడి వద్ద, కొత్తపేట, పల్లవి థియేటర్ సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడు మన రాష్ట్రంలో పుట్టడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టమని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ ని తెలుగు మహిళలు చేశారు. అదేవిధంగా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నూరు విజయ్ చౌదరి, బిబి, తిరుమలేశు, గొట్లూరు శీనా, భీమినేని ప్రసాద్ నాయుడు, కృష్ణాపురం జమీర్ అహ్మద్, మారుతి స్వామి, తోట వాసుదేవా, సురేష్, ఎన్.బి.కె ఫ్యాన్స్ అధ్యక్షులు ఈశ్వరయ్య, అధిక సంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.