Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఖరీఫ్ సాగుకు పెట్టుబడి సాయం అందించండి

విశాలాంధ్ర-రాప్తాడు : అకాల వర్షాలకు, ఈదురు గాలులకు పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం (సీపీఎం)మండల కార్యదర్శి పోతులయ్య డిమాండ్ చేశారు. మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో పంటలు నష్టపోయిన రైతులతో మంగళవారం మాట్లాడి పంట పొలాలను పరిశీలించారు. రైతులు ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధమవుతున్న వేళలో అకాల వర్షాలకు ఈదురు గాలులకు పంటలు దెబ్బ తినడం వలన ఇంకొక పంట పెట్టుకోవడానికి పెట్టుబడి లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. కావున జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్పందించి రైతులకు ఖరీఫ్ సీజన్ పంటకైనా పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఎంపీఈఓ రాజు, సుధాకర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img