Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గుండెపోటుతో చిగిచెర్ల సిఆర్పి మృతి

సంతాపం తెలిపిన ఎంఈఓ, ఉపాధ్యాయుల బృందం
విశాలాంధ్ర- ధర్మవరం : మండల పరిధిలోని చిగిచెర్ల జడ్పీ హైస్కూల్ కాంప్లెక్స్ సిఆర్పి.. సురేష్ కుమార్ (43) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు 2014 నుంచి కాంటాక్ట్ పద్ధతిలో విధులను నిర్వహిస్తున్నారు. వీరు మండల పరిధిలోని పోతుకుంట బీసీ కాలనీలో నివాసముంటున్నారు. అనుకోకుండా ఛాతి నొప్పి రావడంతో, ఇంట్లోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భార్య మాలతి ఇప్పటికే అనారోగ్యంతో బాధపడు తోంది. మృతునికి 12 నెలల మోక్షిత్ 10 సంవత్సరాల గ్రీష్మ అనుకూతురు కలదు. సమాచారం అందుకున్న ఎంఈఓ సుధాకర్ నాయక్, వారి బృందం, మండల సిఆర్పి, ఉపాధ్యాయ బృందం అక్కడకు చేరుకొని నివాళులను అర్పించారు. కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు. త్వరలోనే సిఆర్పి, ఉపాధ్యాయ బృందం కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఎంఈఓ తెలిపారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img