Friday, April 26, 2024
Friday, April 26, 2024

గుంతకల్లులో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిని గెలిపించాలని సిపిఐ ప్రచారం….

విశాలాంధ్ర-గుంతకల్లు : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి ని పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి పోతుల నాగరాజు లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ కోరారు.సోమవారం పట్టణంలో సాయిబాబా కాలేజ్ ప్రిన్సిపాల్ లక్మినారాయణ మొదలు పెట్టి ప్రచారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మల్లయ్య,ఏఐఎస్ ఎఫ్ నియోజకవర్గం ఆర్గినేజింగ్ కార్యదర్శి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img