Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గుంతకల్లు రైల్వే స్టేషన్లో టికెట్ల కోసం జనాలు పడుతున్న ఇబ్బంది….

విశాలాంధ్ర-గుంతకల్లు : గుంతకల్లు రైల్వే స్టేషన్ లో గురువారం టికెట్ల కౌంటర్ మూసి ఉండడంతో ప్రైవేట్ టికెట్ మిషన్ దగ్గర ఒక్కసారిగా సుమారు వందలాది మందికి పైగా రద్దీ పెరగడంతో సమయానికి వెళ్లాల్సిన ప్రయాణికులు టికెట్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆ సమయానికి ప్రయాణానికి వెళ్లాల్సిన ప్రయాణికులకు ట్రైన్లు వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ రైల్వే అధికారులు ఇంత రద్దీగా ప్రయాణికులు వస్తున్నప్పటికీ టికెట్ల కౌంటర్ మూసి వేయడం ఏంటని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 24 గంటలు టికెట్ కౌంటర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.అయితే గుంతకల్లు డివిజన్ రైల్వే స్టేషన్ రాష్ట్రంలోనే ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రైల్వే స్టేషన్లో టికెట్ల కోసం ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img