Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఘనంగా సంక్రాంతి సంబరాలు

విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామంలో గల రూపా రాజా బీసీ ఎంఆర్ పాఠశాలలో సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని మంగళవారం విద్యార్థుల నడుమ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం విద్యార్థులు హరిదాసు, పల్లెపడుచు, గంగిరెద్దుల వాళ్ళ వేషధారణ అందరిని ఆకట్టుకుంది. తదుపరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకర్షించాయి. తదుపరి పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి,సాంప్రదాయాలు, ఆచారాలను, తెలుగు సంస్కృతిని, ప్రతిబింజించడమే పండుగలు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇటువంటి పండుగలను ఎక్కడున్నా, మరవకుండా, పండుగ వేడుకలను జరుపుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రూప రాజా కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి, ఉపాధ్యాయ బృందము, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img