విశాలాంధ్ర`ఉరవకొండ : జగనన్న కాలనీలలో పేదల ఇళ్ల నిర్మాణానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్మాణానికి అందిస్తున్న రూ.1.80 కి బదులు ఐదు లక్షల రూపాయలకు పెంచాలని సిపిఐ పార్టీ ఉరవకొండ తాలూకా కార్యదర్శి మల్లికార్జున అన్నారు. సోమవారం, ఉరవకొండ, వజ్రకరూరు తాసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ పట్టణ పరిధిలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చెప్పన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ప్రస్తుతం ఇల్లు నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు మంజూరు చేయాలని తదితర అనేక డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ పార్టీ తాలూకా సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్, వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్, ఉరవకొండ కార్యదర్శి తలారి మల్లికార్జున, పార్టీ నాయకులు రజాక్ షేక్, మహిళా సంఘం నాయకురాలు వన్నూరమ్మ, నూర్జహాన్, రాజు, గణపలికార్జున తదితరులు పాల్గొన్నారు.