Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

డ్రిప్పు స్పిన్క్లర్లు సకాలంలో రైతులకు అందించాలి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ పట్టణంలో బుధవారం జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయం నందు
ఏపీ ఎం ఐ పి ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ అధ్యక్షతనడ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఎం ఐ కంపెనీల వారీగా, టార్గెట్స్ అచీవ్మెంట్స్, మండలాల వారిగా కంపెనీల వారిగా రైతుల రిజిస్ట్రేషన్లు, పి ఐ ఆర్ లు, బి ఓ క్యూ లు,డీడీలు కలెక్ట్ చేసుకోవడం, కలెక్టర్ అప్రూవల్స్, మెటీరియల్ సప్లై, సీసీలు జనరేషన్, ఫైనల్ ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేయడము, మొదలగు విషయాలపైన, ఎంఐ ఏవోలు,ఎమ్ఐ కంపెనీల డిసీఓలు, ఎంఐ ఇంజనీర్లు, పాల్గొనగా రివ్యూ కార్యక్రమం జరిగినది పిడి సుదర్శన్ మాట్లాడుతూ, అన్ని కంపెనీల ప్రతినిధులు, మన శ్రీ సత్య సాయి జిల్లాకు ఇచ్చినటువంటి టార్గెట్స్ మార్చి నెల ఆర్థిక సంవత్సరం తొందర్లో ముగుస్తున్నందున, దగ్గర పడుతున్నందున, కంపెనీవారు డిపార్ట్మెంట్ వారు కలిసికట్టుగా రైతులకు ఇబ్బంది లేకుండా పనిచేసి,లక్ష్యాన్ని పూర్తి చేయవలసిందిగా ఆదేశించడం జరిగినది అలాగే ఎండలు పెరిగిపోవడంతో రైతులు పంటలు పెట్టుకోవడంలో, ఇప్పటి పరిస్థితిలో డ్రిప్పు ఆవశ్యకత ఎంతైనా ఉంది గనుక రైతుల ఇబ్బంది పడకుండా ప్రతి రైతు వరకు ప్రతి ఒక్కరు పని చేయాలని ఆదేశించడం జరిగినది. ఎవరైనా డ్రిప్పు మరియు స్పిన్క్లర్లు రైతులకు పంపిణీ చేయడంలో గాని అలసత్వం వహిస్తే చర్యలు తప్పని హెచ్చరించడం జరిగిందని పి డీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img