Friday, April 26, 2024
Friday, April 26, 2024

దుకాణాలు తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు న్యాయం చేయాలని వినతి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు కుళ్లాయప్ప కళావతి విష్ణు గోపాల్ తదితరులు సబ్ కలెక్టర్కు తమకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు వీరు సోమందేపల్లి మండలం కేంద్రంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద మరియు హిందూపురం రోడ్డుకు 2022వ సంవత్సరంలో రోడ్డు విస్తరణలో భాగంగా తమ ఆధీనంలో ఉన్న దుకాణాలు ముందున్న మెట్లను రేకులను రోడ్డుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వానికి అందించామని కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు ఆ సెంటర్ నందు వేమన విగ్రహం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మా ఆధీనంలో ఉన్న దుకాణాలు ఖాళీ చేయాలని రోడ్డు విస్తరణ చేస్తామని అధికారులతో ఒత్తిడి చేస్తున్నారు అందువలన మాకు ఉన్న జీవనోపాధి కోల్పోతామని మా జీవితాలు దుర్భరము అవుతాయని కావున మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కార్తీక్ వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయన సోమందేపల్లి తాసిల్దార్ తో మాట్లాడి న్యాయం చేస్తానని విగ్రహం ఏర్పాటుకు ఒక కమిటీ ద్వారా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని అంతవరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img